19, మే 2026, మంగళవారం
పోతన గారి భాగవత పద్యం.!
.
'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా
హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం
దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా...
కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ".!
.
(చదువుకోడానికి హాయిగా ఉండే పద్యం .)
.
సరస్వతీ మాత దర్శనం పోతనకింకా కాలేదు .
ఆ దర్శనంకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఆ మాతృమూర్తి రూపాన్ని ఊహించుకుంటున్నాడు .
అందరూ అనుకునే మాట . సరస్వతీ మాత తెలుపు రంగులో ధగధ్ధగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందని . ఇక తన ఊహలకు పదను పెట్టాడు .
శరత్కాలంలో తెల్లని కాంతులీనే మేఘాల వంటి తెలుపా లేక శారద చంద్రబింబం లాగా ఉంటుందా కాదు కాదు పచ్చకర్పూరం లాంటి తెలుపేమో మాతది . ఊహకు అందలేదు . తెల్లని పటీరమూ (చందనం) , రాజహంసా , జాజిచెండ్లూ , నీహారాలూ (మంచు తుంపెరలు) , డిండీరం ( నురుగు ) , వెండికొండా , రెల్లుపూలూ , మల్లెలూ , మందారాలూ ,
పుండరీకాలూ ( తెల్ల తామర పూలు ) , ఆదిశేషుడూ , అన్నిటికీ మించి ఆకాశ గంగా ప్రవాహం — తెల్లగా , తేలికైన పసుపురంగుతో ఉండే వస్తువులన్నీ మదిలో భాసించాయి .
ఏవీ మాతృమూర్తి తెలుపు రంగుకు ఉపమానాలుగా సరిపోలేదు .
మాతృమూర్తిని ఆర్తితో అడిగాడు ” అమ్మా భారతీ , స్వచ్ఛమైన తెలుపురంగుతో మిరుమిట్లుగొలిపే నిన్ను మదిలో ఎప్పుడు చూడగలుగుతానో గదా !” .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
తెలుగు భాషన్వేషణ
కాళిదాసు – సంస్కృత సాహిత్య మహాకవి
📚 కాళిదాసు – సంస్కృత సాహిత్య మహాకవి కాళిదాసు భారతీయ సంస్కృత సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన మహాకవి, నాటకకర్త మరియు ప్రకృతి కవి। ...
-
పరవస్తు చిన్నయ సూరి | Telugu Scholar Chinnaya Suri పరవస్తు చిన్నయ సూరి Telugu Scholar & Grammarian (1809–1861) ...
-
✍️ రచయితలు ప్రముఖ తెలుగు రచయితల గురించి పూర...
-
జ్ఞానపీఠ్ తెలుగు అవార్డు గ్రహీతలు (Jnanpith Award Telugu Winners): Viswanatha Satyanarayana (1970) C. Narayana Reddy (1988) Ravuri Bharadhw...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి